Labels

హౌడీ మోడీ : అమెరికా వేదికగా పాక్ ను టార్గెట్ చేసిన మోడీ

22, Sep 2019

హౌడీ మోడీ భారీగా సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్ సమక్షంలో పేరెత్తకుండా పాకిస్తాన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

హౌడీ మోడీ అంటూ హ్యూస్టన్ అంతా మార్మోగుతోంది. ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ద్వారా హ్యూస్టన్ చేరుకున్నాడు. భారత, అమెరికా సాంప్రదాయ నృత్య, కళా రూపాల ప్రదర్శనలతో, సమ్ప్రదాయ వాయిద్యాలతో వాయిస్తున్న సంగీతంతో హ్యూస్టన్ లోని ఎన్ ఆర్ జి స్టేడియం మార్మోగుతోంది.. కీర్తనతో ప్రారంభమైన హౌడీ మోడీ. 

ట్రంప్ ను భరత్ కు ఆహ్వానిస్తూ, థాంక్యూ అమెరికా, ఠంక్ యు హ్యూస్టన్ అంటూ ప్రసంగాన్ని ముగించాడు.  ఆ తర్వాత మోడీ, ట్రంప్ సంయుక్తంగా ప్రేక్షకులకు అభివాదం చేశారు.

అమెరికన్ పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరిచిన మోడీ. తగ్గించిన కార్పొరేట్ టాక్స్ వల్ల మరిన్ని కంపెనీలు పెట్టుబడులుపెట్టేందుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. 

పాకిస్తాన్ పేరెత్తకుండా తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు. 

తీవ్రవాదంపై యుద్ధం ప్రకటించిన మోడీ. తీవ్రవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ చాల కృషి చేస్తున్నారంటూ కితాబిచ్చి స్టాండింగ్ ఓవషన్ ఇచ్చారు. 

అన్ని వర్గాలకు చెందిన ప్రజలను కలుపుకుపోతుంది సబ్ కే సాథ్ సబ్ కా విశ్వాస్- మోడీ 

ప్రజాస్వామ్యం, విభిన్నత భారతీయతకు చిహ్నాలు-మోడీ 

హౌడీ మోడీ కి సమాధానమిస్తూ.. భారత్ లో అందరూ బాగున్నారు అనితెలుగుతో సహా  వివిధ భాషల్లో చెప్పిన ప్రధాని మోడీ 

ప్రారంభమైన మోడీ ప్రసంగం. హిందీలో ప్రసంగం ఆరంభించిన మోడీ. 

అక్రమ వలసదారులకు మాత్రమే తాను వ్యతిరేకమని, లీగల్ గా వచ్చిన భారతీయులకు  పూర్తి సహకారం, వారి భద్రత, రక్షణ అన్ని అమెరికా బాధ్యత- ట్రంప్. 

త్రివిధ దళాల ఎక్సర్ సైజ్ ప్రారంభం. టైగర్ ట్రియంఫ్ గా నామకరణం.