Labels

మలేసియాలో భారత సంతతి వ్యక్తికి ఉరిశిక్ష

కౌలాలంపూర్: సమీప బంధువును కిడ్నాప్ చేసి హత్య చేశాడన్న నేరం కింద భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి మలేసియా కోర్టు ఉరిశిక్ష విధించింది. హత్యకు సహకరించినందుకు రశీద్ అబ్దుల్లా అనే మరో వ్యక్తికి కూడా అదే శిక్షను ఖారారు చేసింది. ఇండోనేసియాకు చెందిన సుఖ్వీందర్ సింగ్(27) 2009 జనవరిలో తన సమీప బంధువు గురమర్‌దేవ్ సింగ్(21)ను కిడ్నాప్ చేసి అతణ్ణి విడిచిపెట్టడానికి రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. తర్వాత పోర్ట్ డిక్సన్ ప్రాంతంలో కొడవలితో గురమర్‌దేవ్‌ను హత్యచేశాడు. ఈ నేరాన్ని రశీద్ అబ్దుల్లా ప్రోత్సహించాడు. కేసును విచారించిన న్యాయస్థానం వారిద్దరికీ మరణశిక్ష ఖరారు చేసింది. సాక్ష్యాధారాలు నిందితులిద ్దరికీ వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది. కాగా కుటుంబ సభ్యుల నుంచి డబ్బు వసూలు చేయడానికి గురమర్‌దేవే కిడ్నాప్ నాటకం ఆడించాడన్న నిందితుల వాదన ను కోర్టు వ్యతిరేకించింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గురమర్‌దేవ్ తల్లిదండ్రులు స్వాగతించారు. తమకు సరైన నాయ్యం జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment