Labels

ఆరోపణలు నిరాధారం: ప్రభు దయాళ్

వాషింగ్టన్: తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని న్యూయార్క్‌లోని భారతీయ కాన్సులేట్ జనరల్ ప్రభు దయాళ్ తెలిపారు. పనిమనిషిని బానిసలా చూశామని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, తన ప్రతిష్టకు హాని తలపెట్టేందుకే ఆరోపణలు చేశారన్నారు. మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో సంతోష్ భరద్వాజ్ అనే వ్యక్తి ప్రభు దయాళ్‌పై కేసు నమోదు చేశారు. తన వద్ద సంతోష్ ఢిల్లీలో ఒక సంవత్సరం, మొరాకోలో నాలుగు సంవత్సరాలు, న్యూయార్క్‌లో ఓ సంవత్సరంపాటు పనిచేశారన్నారు.
తన వద్ద పార్ట్ టైమ్‌గా పనిచే యాలనుకుందని అయితే అందుకు తాను ఒప్పుకోలేదని ప్రభు తెలిపారు. అయితే సంతోష్‌కు అధికారిక పాస్‌పోర్ట్ వుందని.. తన వద్ద తప్ప మరేచోట పనిచేయడానికి వీసా నిబంధనలు అనుమతించవన్నారు. తనకు కేటాయించిన గది ఎయిర్ కండీషన్డ్, టెలివిజన్, టెలిఫోన్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చానన్నారు. అంతేకాక పనిమనిషిపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులకు, భారత రాయబార కార్యాలయానికి తెలియచేశానన్నారు.

No comments:

Post a Comment