Labels

  ప్రయాణికులకు విజ్ఞప్తి: ఆకు దొన్నెల్లో ఆహారం అందుకోండి!

 23-09-2019 రత్లాం: మధ్యప్రదేశ్‌లోని రత్లాం రైల్వే జోన్ పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు  ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అలాగే కాగితం, సింథటిక్ వినియోగానికి కూడా చెక్ చెబుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఆకు దొన్నెలను వినియోగిస్తున్నారు. స్టేషన్‌లోని స్టాల్స్, ట్రాలీలు, ఇతర యూనిట్లలో ఆహార పదార్థాలను ఆకు దొన్నెలలోనే అందిస్తున్నారు. స్థానిక రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేశంలో ఏ రైల్వే స్టేషన్‌లోనూ లేని విధానాన్ని తొలిసారిగా ఇక్కడ అమలు చేస్తున్నామని చెప్పారు. ఇండోర్, ఉజ్జయిని, దేవాస్, చిత్తోర్‌గఢ్, దాహాద్‌తో పాటు మరికొన్ని స్టేషన్లలో ఆకు దొన్నెలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.